అంతులేని ప్రేమకథ : భర్తను వదిలేసి పెళ్లైన మూడోరోజే......


ఇదే అంతులేని ప్రేమకథ. తిరుపతి పట్టణంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన షాహినా, సోమశేఖర్‌లు ఏడాదిగా ప్రేమించుకున్నారు. సోమశేఖర్ పెళ్లికి నిరాకరించడంతో షాహినాకు ఆమె తల్లి మరొకరితో వివాహం జరిపించింది. పెళ్లైన మూడో రోజే తల్లి వద్దకు వచ్చిన షాహినాతో ప్రియుడు సోమశేఖర్ మళ్లి మాటలు కలిపాడు. నీతోనే జీవితం అంటూ ఆమెను విజయవాడ తీసుకెళ్లి కాపురం పెట్టాడు. 

‘రెడ్డి గారు’ గా రాబోతున్న బాలయ్య!

బాహుబలి-2‌లో బాలీవుడ్ బాద్‌షా.. నిజమా?

40 రోజుల తర్వాత బంధువుల ఒత్తిడికి తలొగ్గి... షాహినాతో కలసి రేణిగుంట బుగ్గవీదిలోని ఇంటికి ఇద్దరూ వెళ్లారు. యువకుడిని ఇంట్లోకి రానిచ్చిన పెద్దలు షాహినాను గెంటేశారు. షాహినా తల్లి కూడా యవతిని ఇంట్లోకి రానీయలేదు. అర్థరాత్రి ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రియుడు సోమశేఖర్ ఇంటి ముందు రోదిస్తూ న్యాయం చేయాలని ప్రాధేయపడుతోంది.
నిజానికి ఈ కేసులో ఆ యువతి పెళ్లికి ముందే వేరొకరిని ప్రేమించింది. ప్రియుడి తిరస్కారంతో మరొకరిని పెళ్లాడింది. పెళ్లైన తర్వాత మూడురోజులకు ప్రియుడు మళ్లీ కలిశాడు. నువ్వు లేకపోతే పిచ్చోడినవుతానన్న మాటలు నమ్మి మోసపోయింది. ఇపుడు నడి రోడ్డులో నిలబడింది. 

Comments